లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

60చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
వరుసగా రెండు రోజులు పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 238.18 పాయింట్లు పెరిగి 65,893.33 వద్ద, నిఫ్టీ 78.30 పాయింట్లు పెరిగి 19,772.30 వద్ద ఉన్నాయి. దాదాపు 2061 షేర్లు లాభాల్లో ఉండగా, 851 షేర్లు క్షీణించాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, JSW స్టీల్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ప్రస్తుతం లాభాల్లో ఉండగా, కోల్ ఇండియా కంపెనీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.