తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్పై రాళ్ల దాడి జరిగింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని భైంసాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. రోడ్డుషోలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు కలుగజేసుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.