మఠంపల్లి రెడ్డిబజార్, అంబేడ్కర్ కాలనీ, మఠంపల్లి, బైపాస్ రోడ్డులో రోడ్డు విస్తరణ పనులలో భాగంగా పలు ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఏఈ రాంప్రసాద్ ఒక ప్రకటనలో సోమవారం రాత్రి తెలిపారు. 11న పట్టణంలోని బైపాస్ రోడ్డు, లక్కవరం రోడ్డు, అనుముల గూడెం ఏరియాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు అంతరాయం ఉంటుందని వినియోగదారులు సహకరించాలని పేర్కొన్నారు.