మఠంపల్లి మండలం - Mattampally Mandal

వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవం

వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవం

మఠంపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు, సూర్యాపేట జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడాకారుల సహకారంతో వేసవి శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ఎంపీడీవో జానకి రాములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీఓ ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రస్తుత హుజూర్ నగర్ నియోజకవర్గ పాఠశాలల క్రీడల కార్యదర్శి మన్నెం సీతారాం రెడ్డి తెలిపారు.