విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి రూ. 57కోట్లు

79చూసినవారు
విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి రూ. 57కోట్లు
మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రూ. 57కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుధీర్‌ కుమార్‌, చౌటుప్పల్‌ డీఈ విజయ భాస్కర్‌రెడ్డి తదితరులతో విద్యుత్‌ సమస్యలు, నిధుల కేటాయింపు పై సమీక్ష నిర్వహించారు. చండూరు మునిసిపాలిటీ మునుగోడు మండలాలకు రూ. 37కోట్లు కేటాయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు

సంబంధిత పోస్ట్