ఈ ఏడాది జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీకి యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక ‘గ్రూప్ ఏ’లో ఉన్న భారత్ తన తొలి మ్యాచ్ను జూన్ 5న ఐర్లాండ్తో ఆడుతుంది. భారత్-పాక్ జట్లు న్యూయార్క్ వేదికగా జూన్ 9న తలపడనున్నాయి. ఈ పొట్టికప్పు సిరీస్లో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. అమెరికాలో 3, వెస్టిండీస్లో 6 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్లు జరగనున్నాయి. ఫైనల్ జూన్ 29న జరగనుంది.