ఏపీ పరిధిలో చిరుతను విడిచిపెట్టిన తమిళనాడు అటవీ అధికారులు

55చూసినవారు
తమిళనాడులో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది. శుక్రవారం రాత్రి కారు షెడ్డులో ఇరుక్కుపోయిన చిరుత పులికి మత్తు మందు ఇచ్చి బంధించారు. బోనులో బంధించిన చిరుతను సమీప అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. తమిళినాడు అటవీశాఖ అధికారులు చిరుత పులిని బంధించడం వరకు బాగానే ఉన్నా. ఆ చిరుతను ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టి కొత్త వివాదానికి తెరలేపారు. చిరుతను కుప్పం దగ్గరల్లోనే వీర్నమల సమీపంలో వదిలిపెట్టడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.