డ్వాక్రా సంఘాలు పెట్టి.. మహిళలను ప్రోత్సాహించిందే
టీడీపీ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని మహిళలతో ఇవాళ చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక నాయకుడు
ఎన్టీఆర్ అని హర్షం వ్యక్తం చేశారు. డ్వాక్రా సంఘాల్లో లక్షల మంది మహిళలు ఉన్నారంటే అది
టీడీపీ గొప్పతనమని కొనియాడారు.