ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రికి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమిళనాడు మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మార్చి 22న తండుపాతులో జరిగిన డీఎంకే కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి రాధాకృష్ణన్ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.