మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో విషాదం జరిగింది. 5వ తరగతి చదువుతున్న పదేళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తనను జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన భేదాఘాట్కు తీసుకెళ్లాలని తల్లిని కోరగా.. దానికి ఆమె నిరాకరించింది. దీంతో బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.