ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పలువురు ఆందోళనకారులను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు కేజ్రీవాల్ ఇంటి వద్ద 144 సెక్షన్ విధించారు.