ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ సాయంత్రం 12 మందితో కూడిన ఈడీ బృందం సీఎం కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు ప్రశ్నలు అడిగిన అనంతరం కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఢిల్లీ ఎక్సైజ్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు.