దుర్గామాత ఊరేగింపులో ఉద్రిక్తత.. ఒకరు మృతి (వీడియో)

51చూసినవారు
యూపీలోని బహ్రైచ్ జిల్లా మహాసి తహసీల్‌లో ఆదివారం దుర్గామాత విగ్రహం నిమజ్జనం ఊరేగింపులో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో తుపాకీ గాయంతో 22 ఏళ్ల వ్యక్తి మరణించగా.. పలువురు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం, దుర్గామాత ఊరేగింపు ముస్లిం పరిసరాల గుండా వెళ్తుండగా మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు సంగీతాన్ని ఆపేయాలని కోరడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. యువకుడి మృతితో ఆగ్రహించిన హిందువులు ఆ ప్రాంతంలోని వాహనాలు, దుకాణాలకు నిప్పు పెట్టారు.

సంబంధిత పోస్ట్