తటస్థ వేదికపై పాకిస్థాన్తో టెస్టు క్రికెట్ ఆడేందుకు తనకు ఏమీ ఇబ్బంది లేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. పాక్ బౌలింగ్ లైనప్ బాగుంటుందని, ఆ జట్టుతో టెస్టు ఆడితే రసవత్తరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆ జట్టుతో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. కాగా ప్రభుత్వం అనుమతి ఇస్తేనే రెండు దేశాల మధ్య టెస్టు క్రికెట్ ఉంటుందని పలుమార్లు బీసీసీఐ చెప్పిన విషయం తెలిసిందే.