కేరళలోని కొచ్చిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. విద్యానగర్లో 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని వనిష్క అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఓ బిడ్డను ప్రసవించింది. ఆ విషయం తన తల్లిదండ్రులకు తెలియకూడదని భావించిన ఆమె.. పార్సిల్ కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేయటంతో ఆ నవజాత శిశువు చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు కవర్పై ఉన్న అడ్రస్ను బట్టి నిందితురాలిని గుర్తించారు.