ఎల్ఈడీ బల్బు మింగిన ఓ బాలుడిని డాక్టర్లు శ్రమించి కాపాడారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు ఎల్ఈడీ బల్బు మింగాడు. దీంతో తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా బ్రోంకోస్కోపీ ద్వారా ఎల్ఈడీ బల్బును వైద్యులు బయటకు తీశారు.