విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రలోకి జారుకోవడంతో.. సిగ్నల్ లేక ఓ ఎక్స్ప్రెస్ రైలు దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది. ఉత్తర్ప్రదేశ్లో ఇటావా సమీపంలోని ఉడిమోర్ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం.. పట్నా- కోటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ రైలు మే 3న ఉడిమోర్ జంక్షన్కు చేరుకుంది. అయితే.. అప్పటికే అక్కడున్న స్టేషన్ మాస్టర్ నిద్రలోకి జారుకున్నారు.