TG: ఐదుగురు రాజులు నిర్మించిన ఎలగందల్ కోట!

70చూసినవారు
TG: ఐదుగురు రాజులు నిర్మించిన ఎలగందల్ కోట!
తెలంగాణలోని ప్రధాన కోటలలో ఎలగందల్ కోట ఒకటి. కరీంనగర్ జిల్లాలోని ఈ కోట కాకతీతీయులు, బహమనీలు, కుతుబ్ షాహీలు, మొఘల్, అసఫ్ జాహీలతో సహా వివిధ రాజవంశాల అధికార కేంద్రంగా ఉండేదని.. దీనిని నిర్మించారని చెబుతారు. నిజాం పాలనలో ఈ కోట జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉండేది. పూర్వకాలంలో ఎలగందల్‌ను బహుధాన్యపురం, తెల్లకందుల, వెలిగందుల అనేవారు. ఈ కోట లోపల నీలకంఠస్వామి, నృసింహాలయాలు ఉన్నాయి. కోటలోకి ప్రవేశించడానికి 300 మెట్లు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్