పశ్చిమ బెంగాల్లో నకిలీ క్యాన్సర్, షుగర్ మెడిసెన్స్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మార్కెట్ విలువ సుమారు రూ.6.60 కోట్లు ఉంటుందని అంచనా. కోల్కతాలోని ‘కేర్ అండ్ క్యూర్ ఫర్ యు’ హోల్సేల్ సంస్థ ప్రాంగణంలో ఇటీవల జరిపిన దాడిలో గుర్తించామని అన్నారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్సిఒ), డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టరేట్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.