శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల విషయంలో వివాదం నెలకొంది. సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే దీనిపై టీటీడీ తాజాగా స్పందించింది. ఆ వార్త పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. అన్నప్రసాదాల తయారీలో మార్పులు చేసినట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని భక్తులకు సూచించింది.