భారత జట్టుకు ఎంఎస్ ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడే తన దృష్టి విరాట్ కోహ్లీపై పడిందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు విషయాలు వెల్లడించారు. 'కోహ్లీ నాకు సానబెట్టని వజ్రంలా కనిపించాడు. భవిష్యత్తులో కెప్టెన్సీ చేపట్టాల్సి ఉంటుంది. సిద్ధంగా ఉండమని కోహ్లీతో అప్పుడే చెప్పాను' అని రవిశాస్త్రి చెప్పారు. కాగా, రవిశాస్త్రి, కోహ్లీ టెస్టుల్లో మంచి ఫలితాలు సాధించారు.