తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ పెళ్లి వేడుకలో జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన ఓ వివాహ వేడుకలో అతిథులు భోజన సమయంలో ప్లేట్ల విషయంలో గొడవపడ్డారు. దీంతో అతిథులు కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు శుభకార్యాలకు ఇందుకేనా వచ్చేదని వ్యాఖ్యానిస్తున్నారు.