తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై ఈసీ కొరడా ఝళిపించింది. తిరుపతి నగర తూర్పు, పశ్చిమ పీఎస్ ల CIలు, తూర్పు పీఎస్ SI, హెడ్కానిస్టేబుల్పై చర్యలు తీసుకుంది. ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారనే ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్న ఈసీ.. ఈ నలుగురిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. అలిపిరి సీఐను వీఆర్కు బదిలీ చేసింది.