ఎన్‌టీఏ ఆఫీసులోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు

71చూసినవారు
ఎన్‌టీఏ ఆఫీసులోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు
యూజీసీ నెట్‌, నీట్‌ పీజీ వంటి పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ అక్రమాలకు వ్యతిరేకంగా పలు విద్యార్థి సంఘాల నాయకులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారిలో కొందరు గురువారం ఎన్‌టీఏ ఆఫీసులోకి దూసుకెళ్లారు. నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా- ఎన్‌ఎస్‌యూఐ సంఘానికి చెందిన దాదాపు 100 మంది ఆందోళనకారులు ఎన్‌టీఏ ఆఫీసు భవనంలోకి దూసుకెళ్లారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :