ముగియనున్న ప్రచారం.. అప్రమత్తమైన ఎన్నికల కమిషన్

50చూసినవారు
ముగియనున్న ప్రచారం.. అప్రమత్తమైన ఎన్నికల కమిషన్
ప్రచారం ముగియగానే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతుండటంతో ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ప్రలోభాలు, హింసాత్మక ఘటనలపై చివరి 72 గంటలు నిఘా పెంచాలని జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులతో పాటు పరిశీలకులు ఆకస్మిక సోదాలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్