ఆయుష్మాన్ పథకం అమలుకు సిద్ధం

76చూసినవారు
ఆయుష్మాన్ పథకం అమలుకు సిద్ధం
70ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద చేర్చాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 70ఏళ్లు పైబడిన వారు 5లక్షల మంది ఉన్నట్లు వైద్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. వారందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉచిత వైద్యం అందించనున్నారు. ఈ కార్డులు పొందినవారు ఏదైనా అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరితే రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు.

సంబంధిత పోస్ట్