మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగిన చిన్నారి మృతి

59చూసినవారు
మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగిన చిన్నారి మృతి
కృష్ణా జిల్లా మచిలీపట్నం టెంపుల్ కాలనీకి చెందిన మహ్మద్ అబ్బాస్ ఈ నెల 19న తన భార్య, ఇద్దరు పిల్లలు ఆయేషా, ఆఫియాలతో కలిసి విజయవాడ అశోక్‌నగర్‌లోని అత్తింటికి వచ్చాడు. చిన్నారి ఆఫియా (18 నెలలు) అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆడుకుంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. బాత్రూమ్‌లో యాసిడ్ బాటిల్‌ను మంచినీళ్లు అనుకుని తాగింది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి వాంతులు చేసుకోగా.. గమనించిన తండ్రి అబ్బాస్ వెంటనే ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ చిన్నారి ఆఫియా ప్రాణాలు విడిచింది.

సంబంధిత పోస్ట్