గుడిలో అగ్నిప్రమాదం దురదృష్టకరం: సీఎం

573చూసినవారు
గుడిలో అగ్నిప్రమాదం దురదృష్టకరం: సీఎం
భస్మహరతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని మహాకాల్ దేవాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘టెంపుల్‌లో అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం. అడ్మినిస్ట్రేషన్‌తో కాంటాక్ట్‌లోనే ఉన్నా. అన్ని కంట్రోల్‌లోనే ఉన్నాయి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, ఈ ప్రమాదం నుంచి ఆయన కుమారుడు, కుమార్తె త్రుటిలో బయటపడ్డారు. ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే వారున్నారు.