ఇద్దరు పిల్లలతో ఓ తల్లి చెరువులో దూకింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్దచెరువు వద్ద జరిగింది. భర్తతో గొడవ కావడంతో శ్వేత అనే మహిళ అర్థరాత్రి కవల పిల్లలు శ్రీహా, శ్రీహాన్స్తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెద్ద చెరువులో దూకింది. దీంతో తల్లి శ్వేత, చిన్నారి శ్రీహాను అమీన్పూర్ పెట్రోలింగ్ పోలీసులు రక్షించారు. చెరువులో మునిగిన మూడేళ్ల శ్రీహన్స్ కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.