అదానీ గ్రూప్ కన్ను ఇప్పుడు తాజాగా సిమెంట్ రంగంపై పడింది. రూ.25 వేల కోట్లపైనే పలు కంపెనీలను కొనాలని యోచిస్తుందని తెలుస్తోంది. ఈ జాబితాలో HYDకు చెందిన పెన్నా సిమెంట్ సహా సౌరాష్ట్ర సిమెంట్, వాద్రాజ్ సిమెంట్ తదితర సంస్థలున్నాయి. 3-4 ఏళ్లలో ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన అల్ట్రాటెక్ను దాటి అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా నిలవాలని అదానీ గ్రూప్ భావిస్తోంది.