కాశ్మీర్ లో కొనసాగుతున్న కాల్పులు

84చూసినవారు
కాశ్మీర్ లో కొనసాగుతున్న కాల్పులు
జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎనౌకౌంటర్ జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో.. వెంటనే అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పూంచ్ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతానికి అదనపు బల గాలను పంపించామని.. ఉగ్రవాదులు భద్రతా బల గాలపై కాల్పులు జరిపారని అధికారులు చెబుతు న్నారు.