స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో చోటుచేసుకుంది. మద్దుట్ల గ్రామానికి చెందిన ఎండి ఆలిఫా అనే రెండేళ్ల చిన్నారి సోదరుడు పాఠశాలకు వెళ్తూ స్కూల్ బస్సులో కూర్చుకున్నాడు. తన సోదరునితో వెళ్లాలని ఆ చిన్నారి బస్సు ముందుకు వెళ్లింది. ఇది గమనించని డ్రైవర్ స్కూల్ బస్సు ముందుకు పోనించాడు. ఆలిఫా తలపై టైరు ఎక్కడంతో తలకు తీవ్ర గాయమై మరణించింది.