సముద్రంలో నౌక మునిగిపోయి ఏడుగురు గల్లంతు

50చూసినవారు
సముద్రంలో నౌక మునిగిపోయి ఏడుగురు గల్లంతు
ఇటలీలో ఘోర ప్రమాదం సంభవించింది. సిసిలీ తీరంలో తీవ్ర తుఫాను వల్ల ఓ విలాసవంతమైన షిప్‌ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో బ్రిటన్‌ దిగ్గజ వ్యాపార వేత్త మైక్‌ లించ్‌ సహా ఏడుగురు గల్లంతు అయ్యారు. మరో 14 మంది ప్రమాదం నుండి బయటపడ్డారు. సిసిలియన్‌ పోర్టు నుండి ఈయాట్‌ కు ఈ నెల 14న బయలుదేరిన నౌకలో పది మంది సిబ్బంది, 12 మంది ప్రయాణీకులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్‌ లు రంగంలోకి దిగాయి. నౌకను బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్