గంజాయి స్మోక్‌ చేసేందుకు ఎక్సైజ్ సిబ్బందిని అగ్గిపెట్టె అడిగిన స్టూడెంట్స్‌

69చూసినవారు
గంజాయి స్మోక్‌ చేసేందుకు ఎక్సైజ్ సిబ్బందిని అగ్గిపెట్టె అడిగిన స్టూడెంట్స్‌
కేరళలోని ఆదిమలై జిల్లాలో ఇంటర్ విద్యార్థులు కొందరు తమ వద్ద ఉన్న గంజాయి బీడీలను వెలిగించుకునేందుకు ఏకంగా ఎక్సైజ్ కార్యాలయానికే వెళ్లి ‘అగ్గిపెట్టుందా?’ అని అధికారులను అడిగారు. దాంతో అధికారులు నిర్ఘాంతపోయారు. అయితే పొరపాటున దుకాణం అనుకొని.. ఎక్కడికైతే వెళ్లకూడదో అక్కడికి వచ్చామని గ్రహించిన విద్యార్థులు పరుగుపెట్టారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్