రైల్వే స్టేషన్‌లో నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు (Video)

553చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్‌లో నిద్రపోతున్నట్లు నటిస్తూ ఒక వ్యక్తి చోరీలు చేశాడు. ఆ రైల్వే స్టేషన్‌లో పలు దొంగతనాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులకు కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ను వారు పరిశీలించగా.. అవినీష్ సింగ్ (21) వెయిటింగ్‌ రూమ్‌లో నేలపై నిద్రిస్తున్న వారి పక్కనే పడుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు మంగళవారం అతడిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్