పాకిస్తాన్ అక్రమిత కశ్మీర్ (POK)ను భారత్ ఎప్పటికీ వదులుకోబోదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పీవోకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కశ్మీర్ అభివృద్ధిని చూసి POKలోని ప్రజలే తమంతట తాముగా భారత్లో భాగం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతానికి ఈ అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉందని, అక్కడే తగిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.