టీ20 వరల్డ్ కప్తో ఇండియాకు తిరిగొచ్చిన జట్టుకు ముంబైలో అభిమానులు కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వస్వాగతం పలికారు. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తాను ఓపెన్ టాప్ బస్సులో వరల్డ్ కప్ను ఎత్తుకుని అభిమానులకు అభివాదం చేస్తున్న ఫొటోను ఎక్స్లో షేర్ చేశారు. ‘ఈ కప్ మీకోసమే’ అని పేర్కొంటూ త్రివర్ణ పతాకాన్ని పోస్టు చేశారు. ఈ ట్వీట్ వైరలవుతోంది.