భారత రాజ్యాంగ నిర్మాత డా.భీమ్రావ్ అంబేడ్కర్ జయంతిని ఏటా ఏప్రిల్ 14న నిర్వహించుకుంటున్నాం. బాబాసాహెబ్ అని ముద్దుగా పిలువబడే డా.బీఆర్ అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించారు. రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్లకు ఆయన 13వ సంతానం. రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావాల్సిన అవసరాలను, హక్కులను తెలిపిన గొప్ప మహా నాయకుడిగా, ఎంతో మందికి ఆదర్శప్రాయుడిగా అంబేడ్కర్ నిలిచారు.