రెండు లారీలు ఢీ.. ఒకరు మృతి, భారీగా ట్రాఫిక్‌ జామ్

74చూసినవారు
రెండు లారీలు ఢీ.. ఒకరు మృతి, భారీగా ట్రాఫిక్‌ జామ్
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ బ్రిడ్జి పై ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాలు సరఫరా చేసే లారీ డ్రైవర్ దామెర రాజేందర్ రెడ్డి మృతి చెందాడు. బ్రిడ్జి పై రెండు వాహనాలు పడి పోవడంతో కరీంనగర్- జగిత్యాల రహదారిపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :