T20 వరల్డ్ కప్ విషయంలో ఐసీసీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నమెంట్కు ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ను అంబాసిడర్గా ప్రకటించింది. T20 మెన్స్ వరల్డ్ కప్ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు వెస్టిండీస్, యూఎస్లో జరగనుంది. ఈ టోర్నీకి మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు ఐసీసీ బోల్ట్ను అంబాసిడర్గా ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా ఈ నెల చివరిలోపు భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది.