దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 102 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. శివసేన ఎంపీ ఓం ప్రకాశ్ భూపాల్ సిన్హా లోక్సభలో అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని రూట్లలో వందే భారత్ రైళ్లు నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 19 జులై 2024 నాటికి భారతీయ రైల్వే నెట్వర్క్లో 102 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు.