కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజన్గూడలో ఓ వివాహిత ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసింది. బీహార్కు చెందిన నసీం బేగంకు పెళ్లైంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా నంజన్గూడకు చెందిన ఆసిబూర్ రెహమాన్ను ప్రేమించింది. ప్రియుడితో పెళ్లి కోసం ఆమె నంజన్గూడకు వచ్చింది. ఆమె వివాహిత కావడంతో పెళ్లికి ప్రియుడు నిరాకరించాడు. దీంతో ఆమె హోటల్ భవనంపైకి ఎక్కి దూకుతానని బెదిరించింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.