గడ్డి మందు పిచికారి.. పశువులు మృతి

55చూసినవారు
గడ్డి మందు పిచికారి.. పశువులు మృతి
గడ్డి మందు పిచికారి చేసిన మేతను తిని రెండు కాడెడ్లు, ఒక ఆవు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. తాండూరు మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో ఆనంద్ అనే రైతు పొలానికి పశువులను మేపడానికి తీసుకెళ్తుండగా పెద్ద నరసింహులు పొలంలో గడ్డి మందు పిచికారి చేశారు. ఆ గడ్డి తిన్న పశువులు మృతి చెందాయి. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.