వికారాబాద్ శాసన సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు ధరూర్ మండల పరిధిలోని మైలారం, కుమ్మరి పల్లి తాండ, పిసియం తాండా, శేరిగడ్డ తాండలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కే. రాఘవన్ నాయక్ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతి గుర్తుకు ఓటు వేసి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.