లోక్సభ ఎన్నికల వేళ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్లో బూత్ను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ అభ్యర్థిని ఓటర్లు పరుగులు పెట్టించారు. పోలింగ్ కేంద్రానికి రావొద్దు అంటూ రాళ్లు కర్రలతో వెంటపడ్డారు. ఝర్గ్రాం పార్లమెంట్ నియోజకవర్గంలోని మొంగ్లాపోటా గ్రామంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ అభ్యర్ధి ప్రణత్ టుడుపై ఈ దాడి జరిగింది.