విజయవాడ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ 'జగన్ ప్రజల సొమ్ము దోచుకుని రూ.500 కోట్లతో రుషికొండపై ప్యాలెస్ కట్టించుకున్నారని ఆరోపించారు. ప్రజాధనం దోచుకున్నవాళ్లను ఎవరినీ వదిలిపెట్టేది లేదు. ఇక జైలు జీవితం కోసం జగన్ ఎదురుచూడటమే తరువాయి. ఈవీఎంలపై గతంలో తానేం మాట్లాడారో ఓసారి జగన్ వినాలి. జగన్ కళ్లు తెరవకపోతే 3 నెలల్లో వైసీపీ మూతపడుతుందిని' చిన్ని హెచ్చరించారు.