పెళ్ళి కావడం లేదని ఎలుకల మందు తిని యువతి మృతి

64చూసినవారు
పెళ్ళి కావడం లేదని ఎలుకల మందు తిని యువతి మృతి
పెళ్లికావడం లేదని మనస్తాపానికి గురై ఓ యువతి ఎలుకల మందు తిని మృతి చెందిన ఘటన డోర్నకల్ మండలం తోడేళ్ళగూడెం గ్రామంలో బుధవారం జరిగింది. డోర్నకల్ ఏఎస్ఐ కోటేశ్వర రావు తెలిపిన వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన కళ్యాణి (21) ఏడాది క్రితం డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటివద్దనే కాలీగా ఉంటుంది. ఈ క్రమంలో కల్యాణికి కొంతకాలంగా పెళ్ళి సంబంధాలు చూస్తుండగా, వివిధ కారణాలతో కుదరడం లేదని మృతి చెందింది అన్నారు.