

డోర్నకల్: సైకిల్ మీద ప్రభ.. 2 గంటల ఊరేగింపులో బాలుడు
డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో శుక్రవారం ప్రభబండ్ల ఊరేగింపు మహోత్సవాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రభ బండ్ల మహోత్సవంలో 3వ తరగతి చదువుతున్న బచ్చనబోయిన ఆనంద్ సాయి రెండు గంటలు ప్రభని సైకిల్ మీద ఊరేగింపు చేశాడు. ఆ ప్రభ అంతే అతనికి చాలా ఇష్టమని, నాలుగు సంవత్సరాల నుండి ఇలానే ఆ ప్రభని ఊరేగింపు చేస్తున్నాడని బాలుడి తండ్రి తెలిపాడు.