మొక్కజొన్నలు తిని ఆవు మృతి
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన రైతు తోడేటి సత్యం తనకు ఉన్న ఆవు మొక్కజొన్నలు తిని శనివారం మృతి చెందింది. ఎండాకాలం సందర్బంగా గ్రామంలో రైతులు అందరు ఆవులను వదిలేశారు. ఆవు అడవికి వెళ్ళి చేనులో ఉన్న ఎండు మొక్కజొన్నలు తిని అరిగించుకోలేక మృతి చెందిందని, తనకు రూ. 50వేల నష్టం జరిగిందని ఆ రైతు తెలిపారు.