ఘనంగా సీతారాముల కళ్యాణం

60చూసినవారు
శ్రీరామనవమి సందర్బంగా డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బుధవారం సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణం పూర్తి అయినా తరువాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో గ్రామంలోని ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. గ్రామ పెద్దలు, రైతు సమన్వయ కమిటి అధ్యక్షులు మధు సూదన్ రావు, ఎంపీటీసీ నాగమణి, మాజి సర్పంచ్ రాంప్రసాద్, గ్రామ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్